సంబంధిత వార్తలు
- నారీ శక్తి వందన్కు మద్దతు ఇవ్వండి : టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ
- ఇపుడే ఏం కాలేదు.. ముందుంది మొసళ్ళ పండుగ : అమెరికా మంత్రి
- శోభనం గదిలో భర్తకు నవ వధువు షాక్, రూ. 90 లక్షలు ఇస్తేనే నేను నీ దాన్నవుతానంటూ కండీషన్
- నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం : సీఎం రేవంత్ రెడ్డి
- పునర్విభజన పేరుతో రాజ్యాంగంపై దాడి : సోనియా గాంధీ
మహిళలకు రూ.2 వేలు, ఒక ఇంటికి రూ.10 వేలు, మూడు పండుగలకు మూడు సిలిండర్లు ఫ్రీ... బీజేపీ మేనిఫెస్టో
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేలతో పాటు చిన్నాచితక పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా మేనిఫెస్టోను వెల్లడించింది. ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా అర్హులైన మహిళలకు నెలకు రూ.2 వేలు పింఛన్, ప్రతి ఇంటికి రూ.10 వేలు నగదు, సంక్రాంతి, దీపావళి, తమిళ ఉగాది పండుగలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడు బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో కేంద్ర మంత్రి, ఆ పార్టీ జాతీయ పూర్వ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలోని హామీలను పరిశీలిస్తే...
ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు నెలకు రూ.2,000 ఆర్థికసాయం
ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు (పొంగల్, దీపావళి, తమిళ కొత్త సంవత్సరం రోజున)
ఆర్థికసాయం కింద ప్రతి ఇంటికి ఒకేసారి రూ.10,000
మహిళలకు ఇ-స్కూటర్ల కొనుగోలుపై రూ.25,000 రాయితీ
జల్లికట్టు ఎద్దులను పెంచేవారికి నెలకు రూ.2,000 సాయం
జల్లికట్టులో పోటీపడి మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్-గ్రేషియా
మహిళలకు రూ.8000 విలువైన కూపన్ (టీవీ వంటి గృహోపకరణాలు కొనుక్కోవడం లేదా మార్చుకోవడానికి)
తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు 3శాతం స్టాంప్ డ్యూటీ రాయితీ
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో స్థానిక నివాసితుల కోసం ప్రతిరోజూ రెండు గంటల దర్శన సమయాల కేటాయింపు వంటి హామీలను ప్రకటించారు.
