గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 26 నవంబరు 2016 (16:05 IST)

పాత రూ.500 నోట్లతో మొబైల్ రీచార్జ్ చేయించుకున్నవారెందరు? లెక్క తీస్కుంటున్న కేంద్రం... ఎందుకబ్బా?

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏ నిర్ణయం తీసుకున్నా దాని గురించి జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రధానమంత్రి మోదీ పెద్ద నోట్ల రద్దుతో అటు సామాన్యులు ఇటు మధ్యతరగతి ప్రజలు నోట్ల కోసం రోడ్లపై పడాల్సి వచ్చింది. నల్ల కుబేరులు ఎక్కడా బ్యాంకుల వద్ద కనబడలేదు. కానీ వాళ్

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏ నిర్ణయం తీసుకున్నా దాని గురించి జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రధానమంత్రి మోదీ పెద్ద నోట్ల రద్దుతో అటు సామాన్యులు ఇటు మధ్యతరగతి ప్రజలు నోట్ల కోసం రోడ్లపై పడాల్సి వచ్చింది. నల్ల కుబేరులు ఎక్కడా బ్యాంకుల వద్ద కనబడలేదు. కానీ వాళ్ల డబ్బు మాత్రం బ్లాక్ నుంచి వైట్ అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఇదిలావుంటే తాజాగా కేంద్రం చేస్తున్న మరో పనికి సామాన్యులు వణికిపోతున్నారు. ఇంతకీ కేంద్రం చేస్తున్నదేమిటంటే... రద్దయిన రూ.500 నోటుతో రిటైలర్ల వద్ద మొబైల్‌ రీఛార్జ్‌ చేయించుకున్న వారి నెంబర్లను సేకరిస్తోంది. ఐతే దీనికి కారణం రద్దయిన రూ.500 నోటుతో మొబైల్ రీచార్జ్ చేయించుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఆ కారణంగానే ఆ వివరాలను అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరి సర్వీసు ప్రొవైడర్లు ఇచ్చిన పాత నోట్లకు మొబైల్ రీచార్జ్ చేయించుకున్న కస్టమర్ల సంఖ్యలో ఏదయినా తేడా కొట్టిందో ఏమో మరి.