1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Cockroach Janta Party Founder Abhijeet Dipke Set To Return To India, Calls Students To Join Delhi Protest

ధర్నాకు పిలుపునిచ్చిన కాక్రోచ్ పార్టీ - భారత్‌‌కు అభిజీత్ దీప్కే (video)

Cockroach Janta Party
Cockroach Janta Party
కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే భారత్‌లోకి అడుగుపెట్టనున్నారు. జూన్ 6న కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ ధర్నాలో పాల్గొనాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. 
 
ఢిల్లీలో జూన్ 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు అభిజీత్ దీప్కే ప్రకటించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. 
 
జూన్ 6న మద్దతుదారులందరూ ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని వీడియోలో పేర్కొన్నారు. జంతర్ మంతర్‌లో శాంతియుత ప్రదర్శన కోసం పర్మిషన్ కోరుదామని తెలిపారు. నీట్, సీబీఎస్ఈ పరీక్షల విషయంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని.. దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
దయచేసి నన్ను విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే వుండండి, ఆపొద్దు: తమిళనాడు సీఎం విజయ్