'కాక్రోచ్ జనతా పార్టీ' ట్విట్టర్ ఖాతా బ్లాక్ ... ఎందుకో తెలుసా?
సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపివేశారు. అనధికారిక పొలిటికల్ క్యాంపెయిన్ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ ఎక్స్ ఖాతాను నిలిపివేశారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు.
ఎక్స్ ఖాతా నిలిపివేసే సమయానికి ఆ ఖాతాకు దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు, కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే సీజేపీకి చెందిన ఇన్స్టా ఖాతాను 14 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతుండటం గమనార్హం. సీజేపీ పేరిట వెబ్సైట్ కూడా ప్రారంభించారు.
కొంత మంది యువకులను బొద్దింకలతో పోల్చుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలోనే సటైరికల్గా కాక్రోచ్ జనతా పార్టీ అనే వేదిక పుట్టుకొచ్చింది.
ఈ ఆన్లైన్ క్యాంపెయిన్ను అభిజీత్ దీప్కే అనే యువకుడు ప్రారంభించారు. అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీలో ఇటీవలే పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఈ పార్టీలో చేరేందుకు కావాల్సిన అర్హతలు, మేనిఫెస్టో, విజన్ను తమ వెబ్సైట్లో పొందుపరిచారు.
