సంబంధిత వార్తలు
- హెచ్ఐవి వుందన్నా వదలని కామాంధుడు, అత్యాచారం చేసి ఇనుప రాడ్తో బాధితురాలిపై దాడి
- అరవ శ్రీధర్ నాకు అన్యాయం చేసాడు: తెదేపా ప్రజాదర్బారులో బాధితురాలు హర్షవీణ, వీడియో
- లోన్ యాప్ వేధింపులు.. ఉరేసుకున్న యువకుడు.. ఎక్కడ?
- రంజాన్లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...
- వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఈ బాదం పప్పులు తినండి, నా ఫైల్ గుర్తొస్తుంది: అధికారిణి టేబుల్ పైన బాదం పోసిన బాధితుడు
నాకు మీ ఫైల్ ఇచ్చారా... గుర్తులేదే, చూస్తాను అని గత కొన్ని నెలలుగా తనకు సమాధానంగా చెబుతున్న అధికారిణి తీరుపై ఓ వ్యక్తి తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. తన అసహనాన్ని వినూత్నంగా తెలియజేసాడు. నేరుగా కార్యాలయంలోని అధికారిణి టేబుల్ వద్దకు వెళ్లాడు. తన ఫైల్ క్లియరెన్స్ గూర్చి మరోసారి అఢిగాడు. ఎప్పటిలాగానే ఆమె ఆ ఫైల్ గుర్తులేదు అని చెప్పేసరికి తనతో తెచ్చుకున్న బాదం పప్పులను టేబుల్ పైన పారబోసాడు.
ఈ ఘటన ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో జరిగింది. హౌసింగ్ బోర్డులో తన ఇంటికి సంబంధించి ఓ పని కోసం గత కొన్ని నెలలుగా బాధితుడు తిరుగుతున్నాడు. ఐనా పని జరగకపోవడమే కాకుండా అక్కడ వున్న అధికారిణి సమాధానం, ఫైల్ ఎప్పుడు ఇచ్చారో గుర్తులేదు అనడంతో అతడు తీవ్ర అసహనానికి గురయ్యాడు. తన చేతిలో వున్న బాదం పప్పులను ఆమె టేబుల్ పైన పోసి.. ఇవి తింటేనైనా మీకు జ్ఞాపక శక్తి వస్తుందేమో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
"నా ఫైలు ఎక్కడ?" అని అడిగితే 'గుర్తులేదు' అన్న అధికారి.. బాదంతో బుద్ధి చెప్పిన బాధితుడు.
— ChotaNews App (@ChotaNewsApp) April 18, 2026
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. తన ఫైలు క్లియరెన్స్ కోసం హౌసింగ్ బోర్డు కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో విసిగిపోయాడు. అధికారులు… pic.twitter.com/JUFut10BRN
