1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Firozabad : Man kills toddler after woman rejects marriage proposal

పెళ్లికి నిరాకరించిన మహిళ - బాలుడిని నేలకేసి కొట్టి చంపేసిన కిరాతకుడు

toddler kill
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. మనస్పర్థల కారణంగా తన బిడ్డతో కలిసి భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ పెళ్లికి నిరాకరించింది. దీన్ని జీర్ణించుకోలేని ఓ యుకుడు ఆ మహిళ కుమారుడిని నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా, ఈ వీడియో దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఫిరోజాబాద్‌కు చెందిన రతిదేవి (40) అనే మహిళ టీచర్‌గా ఉద్యోగం చేస్తూ భర్త నుంచి విడిపోయి, తన యేడాదిన్నర కుమారుడు ఆరవ్‌తో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. భర్తతో విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ విషయంలో ఆమెకు సాయం చేస్తానని జితేంద్ర్ అలియాస్ విరాజ్ ఆమెకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఆ వివాహితపై మనసు పారేసుకున్న విరాజ్.. తన మనసులో మాట ఆమెకు చెప్పి, వివాహ ప్రతిపాదన చేశాడు. అయితే, ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా పెళ్లికి అంగీకరించడంతో రతిదేవిపై విరాజ్ పగ పెంచుకున్నాడు. 
 
ఈ నేపథ్యంలోనే చాక్లెట్ కొనిస్తానని చెప్పి, రతిదేవి కొడుకు ఆరవ్‌ను బయటకు తీసుకెళ్లిన విరాజ్... ఇంటికి 50 మీటర్ల దూరంలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి, ఆ చిన్నారిని పదేపదే నేలకేసి ఘోరంగా కొట్టాడు. బాలుడు గుక్కపెట్టి ఏడుస్తున్నా ఏమాత్రం కనికరించకుండా మానవ మృగంలా నేలకేసి కొట్టాడు. ఆ బాలుడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని రతిదేవి ఇంటివద్ద పడేసి పారిపోయాడు. 
 
దీన్ని రతిదేవి కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆరవ్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేశారు.

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భర్త కిరాతక చర్య : భార్యను గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి చిత్రహింసలు