సంబంధిత వార్తలు
- ఐపీఎల్ 2026 : గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్.. బోరున విలిపించిన వైభవ్
- కోలీవుడ్ అగ్రహీరో అజిత్కు మాతృవియోగం
- రాజస్థాన్లో దారుణం : నలుగురిని హత్య చేసి దహనం చేసిన మాజీ సర్పంచ్ మొదటి భార్య
- పవన్ కల్యాణ్ గారిని అలా ఎలా అనాలనిపించిందమ్మా?: సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది
- భార్య నచ్చలేదు.. భర్తే ఆమెను రూ.50వేలకు స్నేహితులకు అమ్మేశాడు..
గుజరాత్లో దారుణం : ఇద్దరు మైనర్ బాలికలు గర్భం - చోద్యం చూసిన తల్లి
గుజరాత్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడు ఇద్దరు మైనర్ బాలికలను గర్భవతులను చేశాడు. ఈ విషయం తెలుసుకున్న కన్నతల్లి మౌనం వహించి, చోద్యం చూస్తుండిపోయింది. ఈ కేసులో పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు.
గుజరాత్లో ఓ కీచకుడు ఇద్దరు మైనర్ సవతి కుమార్తెలపై (12 యేళ్ల, 13 యేళ్లు) గత కొన్నేళ్లుగా అడవికి తీసుకెళ్లి, బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. చిన్న కుమార్తెకు కడుపునొప్పిరావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలింది. భయంతో పెద్ద కుమార్తె అసలు నిజం చెప్పడంతో ఆమెకు కూడా పరీక్షలు చేయించగా 2 నెలలుగా గర్భవతి అని తేలింది.
పెద్ద కుమార్తెకు జన్మించిన శిశువును ఓ కజిన్ విక్రయించినట్టు సమాచారం. ఈ ఘోరం అంతా తెలిసినా తల్లి మౌనంగానే ఉండిపోయింది. నవసారి జిల్లా పోలీసులు తక్షణమే తక్షణమే స్పందించి, నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసి విచారణ జరుపుతోంది.
