గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 మే 2016 (08:39 IST)

అదృష్ట సంఖ్య ప్రకారం విజయం మాదే : జయలలిత

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఇప్పటివరకు వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం డీఎంకే వైపే మొగ్గు చూపిస్తుండగా, తమిళనాడు రాష్ట్రంలోని స్థానిక మీడియా నిర్వహించిన ఫలితాలు మాత్రం జయలలిత వైపు అనుకూలంగా ఉన్నాయి. మొత్తంమీద ఈ ఫలితాలు ఉత్కంఠ పోరును తలపిస్తున్నాయి. 
 
అయితే, అన్నాడీఎంకే శ్రేణులు మాత్రం విజయం తమదేని ఘంటాపథంగా చెపుతున్నారు. దీనికి కారణాలు కూడా వారు వివరిస్తున్నారు. నిజానికి ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు పాలక పక్షాన్ని కలవరపెడుతున్నప్పటికీ.. అన్నాడీఎంకే నేతలు మాత్రం మళ్లీ విజయం మాదేనన్న ధీమాలో ఉన్నారు. 
 
జయలలిత అదృష్ట సంఖ్య ప్రకారం విజయం తథ్యమంటున్నారు. జయలలిత ఓటు వేయడానికి బయలుదేరిన సమయం నుంచి ఓటు వేయడం, ఓటరు సంఖ్యతో సహా అన్నీ లెక్కగట్టి.. సంఖ్యాశాస్త్రం ప్రకారం విజయం తప్పకుండా వరిస్తుందని ఆమె అనుయాయులు అనుకుంటున్నారు. 
 
ఓటు వేసిన తర్వాత 'మరో రెండు రోజుల్లో తెలుస్తుంది' అంటూ మళ్లీ రెండుపైనున్న తన ప్రేమను చాటుకున్నారని అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి ఈ రెండు తమకు కలిసిరావడంతో పాటు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠంలో తమ అధినేత్రి కూర్చుంటారని జయలలిత అభిమనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.