గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 23 జులై 2015 (09:11 IST)

అబ్దుల్ కలాం ఫోటోకు దండ వేసి.. బొట్టుపెట్టి అంజలి ఘటించిన జార్ఖండ్ మంత్రి!!

మాజీ రాష్ట్రపతి, దేశంమెచ్చిన అణుశాస్త్రవేత్త అబ్దుల్ కలాం జీవించివుండగానే, ఆయనకు మంత్రులు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈ ఘనకార్యం చేసిన మంత్రి ఎవరో తెలుసా... జార్ఖండ్ రాష్ట్ర మహిళా మంత్రి. ఈమె నిర్వహించే శాఖ జార్ఖండ్ రాష్ట్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ. ఈమె పేరు... నీరా యాదవ్.
 
 
రాంచీలో ఓ స్కూల్ కార్యక్రమానికి హాజరైన ఈమె.. అబ్దుల్ కలాం చిత్రపటానికి దండవేసి, తిలకం దిద్ది, దండం పెట్టారు. ఈ ఫొటోలు తొలుత స్థానిక వార్తా పత్రికల్లో, ఆ తర్వాత సామాజిక వెబ్‌సైట్లలో దర్శనమివ్వడంతో.. అవి చూసిన వారందరూ అవాక్కయ్యారు. 
 
అదీకూడా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్, స్కూల్ టీచర్ ఉమేశ్ ప్రసాద్ సమక్షంలో మహిళా మంత్రి కలాం ఫొటోకు దండ వేసి అంజలి ఘటించారు. అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తడంతో తేరుకున్న మహిళా మంత్రి, తాను కేవలం కలాం ఫొటోకు బొట్టు పెట్టానని, అదివరకే ఎవరో దండ వేశారని వివరణ ఇచ్చారు.