గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 27 జులై 2015 (21:29 IST)

భారతరత్న అబ్దుల్ కలాం ఫోటోకు ముందుగానే దండ... అదే ఆయుష్షును తీసిందా...?!!

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనుకుంటూ 2020 విజన్ పై విద్యార్థులకు బోధనలు ఇచ్చే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, తన చివరి అంకం వరకూ అలాగే ప్రసంగిస్తూనే ఉన్నారు. మన పెద్దవాళ్లు అంటుంటారు... అశుభం అనేది కలలో కూడా తలచుకోరాదనీ, ఐతే ఇటీవల ఆయనకు జార్ఖండ్ రాష్ట్ర మానవవనరుల శాఖామంత్రి కలాం ఫోటోకు దండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 
 
దానిపై దేశం యావత్తూ చర్చ జరిగింది. ఐతే ఆమె ఆ తర్వాత సర్దుకుంది. కానీ జరిగిన తప్పు మళ్లీ సరిదిద్దుకోలేరు కదా. అలా ఆమె ఎందుకు వేశారో కానీ... ఆ ఘటన జరిగి వారం కూడా తిరగక మునుపే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఏదేమైనా దేశం ఓ గొప్ప మేధావిని కోల్పోయింది.