కేరళ రాజకీయ చరిత్రలో తొలిసారి.. జైలు లోపల నుండి పదవీ ప్రమాణ స్వీకారం
Kerala BJP Councillor
కేరళ రాజకీయ చరిత్రలో ఒక ప్రజాప్రతినిధి జైలు లోపల నుండి పదవీ ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి. వార్డు 20కి చెందిన కౌన్సిలర్ సుగతన్, గతంలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా పలువురు దేవుళ్ల పేర్లను ప్రస్తావించిన కారణంగా హైకోర్టు ఆ ప్రమాణాన్ని చెల్లనిదిగా ప్రకటించిన వారిలో ఒకరు.
ప్రమాణ స్వీకారం తప్పనిసరిగా చట్టబద్ధమైన విధానంలోనే ఉండాలని, పలువురు దేవుళ్ల పేర్లను ప్రస్తావించడం ద్వారా దానిని మార్చకూడదని హైకోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది. కేరళ హైకోర్టు అనుమతితో ఈ కార్యక్రమం జరిగింది. మేయర్ వి.వి. రాజేష్ సుగథన్తో ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం న్యాయస్థానం బాధ్యత అని హైకోర్టు అంతకుముందు రోజు పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలని కోర్టు స్పష్టం చేసింది. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొన్న కోర్టు, ప్రజల తీర్పును నిలబెట్టేందుకే అటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
