శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 16 జూన్ 2014 (13:35 IST)

భార్యాభర్తల గొడవ: కూతుర్ని నరికేసిన తండ్రి!

భార్యాభర్తల గొడవ చివరికి కన్నబిడ్డను పొట్టనబెట్టుకుంది. భార్యాభర్తల గొడవ చినికిచినికి గాలివానలా మారింది. భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి తన కూతుర్ని నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. అంతేగాక భార్యను, మరదలిని, మేనకోడలిని కూడా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. నిందితుడు సుబోధ్ సాహు (37) కియోంఝర్ జిల్లాలో పని చేస్తుండగా, అతడి భార్య, పిల్లలు, ఇతర కుటుంబసభ్యులు మాత్రం భువనేశ్వర్‌లో ఉంటున్నారు. అయితే వేరు కాపురం పెట్టాలని అతడి భార్య ఎప్పటినుంచో గొడవపడుతోంది. అలా చేస్తే ఖర్చులు పెరిగిపోతాయన్న సుబోధ్ ఆమెతో తీవ్రంగా గొడవ పడ్డాడు.
 
ఆ తర్వాత ఆగ్రహంతో తన కన్న కూతుర్ను కత్తి నరికి చంపాడు. అంతటితో ఆగకుండా తన భార్యను, మరదలిని, మేనకోడలిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అతని దాడిలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అందరిపై కత్తితో దాడి చేసిన తర్వాత నిందితుడు సుబోధ్ విషం తాగి, ఆత్మహత్యకు యత్నించాడు. ఘటనను గమనించిన ఇరుగుపొరుగు వారు బాధితులను ఆస్పత్రికి తరలించారు.