శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2016 (15:00 IST)

కుమార్తెను వేధించిన యువకుడిని పోలీసులకు పట్టిచ్చిన తల్లి.. ఎక్కడ?

కుమార్తెను వేధిస్తున్న ఓ వ్యక్తిని ముంబై మహిళ 22 రోజుల తర్వాత పోలీసులకు అప్పగించింది. దక్షిణ ముంబై కళాశాలలో చదువుతున్న యువతిని జనవరి 30న అదే సబ్ వేలో వేధించాడు. జరిగిన విషయాన్ని ఆ యువతి.. ఆమె తల్లితో చెప్పింది. ఇంకా ఆ యువకుడు ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి అదే ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో కాపు కాసిన ఆ మహిళ.. 22 రోజుల నిరీక్షణ అనంతరం తిరిగి అదే స్టేషన్లో పట్టుకుంది.  
 
ముంబైలోని మెట్రో సినిమా సబ్ వే స్టేషన్‌లో 22 ఏళ్ల నిరుద్యోగి నడిచి వస్తున్నాడు. అతని వెనకే వచ్చిన బాధితురాలి తల్లి.. అతనిని ఒక్కసారిగా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. తనను వేధించిన వ్యక్తి ఇతనేనని సదరు యులవతి గుర్తుపట్టగా కేసు నమోదు చేసిన ఆజాద్ మైదాన్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు.