బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (11:09 IST)

అత్యాచారం చేసిన బావ: తిరగబడిన మహిళ.. జననాంగాలతో పోలీస్ స్టేషన్‌కు ఎక్కడ?

మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఓ 30 ఏళ్ల మహిళ తనపై అత్యాచారం చేసిన తన బావ జననాంగాలను కొడవలితో కోసిపారేసింది. ఆ తర్వాత వాటిని తీసుకుని ఎక్కడికి వెళ్లిందో తెలుసా? ఏకంగా పోలీస్ స్టేషన్‌కి. ముగ్గురు పిల్లల తల్లైన తనపై నాలుగు రోజులుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో సహించలేని ఆమె తిరగబడింది. పిల్లలను పిలుచుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. 
 
జననాంగాలు చూసి దిగ్బ్రాంతి చెందిన పోలీసులు ఆమె చెప్పిన వివరాలతో కేసు నమోదు చేసుకుని ఆమె బావ దగ్గరికి మెడికల్ టీంను పంపారు. అయితే అవమానం భరించలేని అతను చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.