సోమనాథ్ ఆలయంలో అంబానీ దంపతుల పూజలు - రూ.5 కోట్ల విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ దంపతులు గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయాన్ని శుక్రవారం సందర్శించారు. ద్వాదశ జ్యోతిర్లాంగల్లో ఒకటైన ఈ శైవక్షేత్రంలో ఆయన తన సతీమణి నీతా అంబానీ, తనయుడు అనంత్ అంబానీతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
ముందుగా ఆలయానికి చేరుకున్న అంబానీ దంపతులకు ఆలయ ట్రస్ట్ సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అంబానీ దంపతులకు సోమనాథుడి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సోమనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ రూ.5 కోట్లు విరాళం ఇచ్చారు. గతేడాది జనవరిలోనూ ముఖేశ్ అంబానీ, అనంత్ అంబానీ సోమనాథుడిని దర్శించుకున్న విషయం తెల్సిందే.