మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (13:18 IST)

మదర్సాలో చదివేందుకు ఇష్టపడని చిన్నారులు.. కాళ్ళకు సంకెళ్లు వేయించిన కన్నతండ్రి... ఎక్కడ?

బెంగుళూరులో జరిగిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదర్సాలో చదువుకునేందుకు నిరాకరించిన ముగ్గురు చిన్నారుల కాళ్ళకు కన్నతండ్రే సంకెళ్లు వేశాడు.

బెంగుళూరులో జరిగిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదర్సాలో చదువుకునేందుకు నిరాకరించిన ముగ్గురు చిన్నారుల కాళ్ళకు కన్నతండ్రే సంకెళ్లు వేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... నగరంలోని హెచ్ఎస్ఆర్‌లే అవుట్‌కు చెందిన సిరాజ్ వహాబ్‌కు ముగ్గురు కుమారులు. వారంతా 7 నుంచి పదేళ్ల వయసులోపు వారే. వారిపై గంపెడాశలు పెట్టుకున్న సిరాజ్... మదర్సాలో చదువుకోమని వారిని పురమాయించాడు. అయితే మదర్సాలో చదువుకునేందుకు ఆ ముగ్గురు బాలురు నిరాకరించారట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిరాజ్ అక్కడికి సమీపంలోని మదర్సాకు చెందిన మౌలానాతో ఈ విషయం చెప్పాడు.
 
పిల్లలకు బుద్ధి చెప్పి మదర్సాలో చదువుకునేలా చేయాలని సిరాజ్... మౌలానాను ప్రాధేయపడ్డాడు. సిరాజ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మౌలానా ఆ ముగ్గురు పిల్లల కాళ్లకు ఒకే గొలుసుతో సంకెళ్లేశాడు. దీనిపై సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు సివిల్ డ్రెస్‌లో మదర్సాకు వెళ్లి బాధిత పిల్లలతో మాట్లాడగా సిరాజ్, మౌలానా కలిసి తమకు సంకెళ్లు వేసినట్టు చెప్పారు. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సిరాజ్, మదర్సా మౌలానాలను అదుపులోకి తీసుకుని జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు పెట్టారు.