1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Not Gold Or Cash, But Bihar Thieves Allegedly Stole A 132-Foot Mobile Tower In Buxar

బంగారం కాదు.. నగదు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే దోచుకున్నారు.. ఎక్కడ?

Bihar Cell Tower
Bihar Cell Tower
బీహార్ దొంగలు సెల్ ఫోన్ టవర్‌నే దొంగలించేశారు. అవును నిజమే.. ఏళ్ల తరబడి అక్కడ ఉన్న టవర్ ఉన్నపళంగా మాయమైంది. చిన్న వస్తువులు, నగదు, బంగారాన్ని దోచుకున్న కాలం పోయి.. ప్రస్తుతం ఏకంగా 132 అడుగుల ఎత్తున్న భారీ మొబైల్ టవర్‌నే మాయం చేశారు దొంగలు. 
 
బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిరంతరాయంగా టెలికాం సేవలను అందిస్తున్న ఒక పెద్ద మొబైల్ టవర్‌ను దొంగలు గుట్టుచప్పుడు కాకుండా విరగ్గొట్టి, ముక్కలు ముక్కలుగా చేసి తరలించేశారు. కేవలం టవర్‌ను మాత్రమే కాకుండా, అక్కడ అమర్చిన భారీ జనరేటర్, దానికి సంబంధించిన ఇతర విలువైన టెలికాం సామగ్రిని కూడా దొంగలు వదలకుండా ఎత్తుకెళ్లడం గమనార్హం. 
 
ఇటీవల సదరు టెలికాం కంపెనీ అధికారులు, సాంకేతిక సిబ్బంది నిరంతర నిర్వహణ పనుల కోసం ఆ సైట్ వద్దకు వెళ్ళినప్పుడు, అక్కడ టవర్ లేకపోవడాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంకా స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ మొబైల్ టవర్ చోరీ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
Jaspal Rana, ఆయన దిగ్గజ షూటర్, కానీ తన గుండె ధమనిపై గురి పెట్టలేకపోయారు, హృదయం ఆగిపోయింది