1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. She was about to cross the railway tracks with her children, when suddenly, a speeding train approached, Video

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

Mother saved children
ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతోంది ఆ మహిళ. ఇంతలోనే వేగంగా రైలు వచ్చేసింది. దీనితో తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఫ్లాట్ఫాంకి రైలు ట్రాకుకి మధ్య పిల్లల్ని గట్టిగా హత్తుకుని కూర్చుంది. రైలు వేగంగా వారిని టచ్ చేస్తూ వెళ్లింది. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో వారు బైటపడ్డారు.
 
ఈ ఘటన బీహారు రాష్ట్రంలోని సమిష్టిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషనులో జరిగింది. ట్రాక్ దాటేందుకు కనీసం వంతెన కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషను దగ్గర జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ