1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Tata Motors Achieves 10 Lakh Commercial Vehicles Production Milestone at its Lucknow Plant

టాటా మోటార్స్ తన లక్నో ప్లాంట్‌లో 10 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి మైలురాయి

Yogi Adityanath
లక్నో: టాటా మోటార్స్ లిమిటెడ్, భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఈ రోజు లక్నో ప్లాంట్‌లో 10 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా 10వ లక్ష వాహనాన్ని విడుదల చేసింది. ఇది ఉత్తరప్రదేశ్‌లో సంస్థకు 35 ఏళ్లకు పైగా ఉన్న బలమైన ఉనికిని, అలాగే పరిశ్రమ అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో చేసిన కృషిని ప్రతిబింబిస్తుంది.

భారత వాణిజ్య వాహన రంగం కాలుష్య-రహిత, స్మార్ట్, సమర్థవంతమైన మొబిలిటీ వైపు వేగంగా మారుతున్న ప్రస్తుత సమయంలో, ఈ మైలురాయి భవిష్యత్ మొబిలిటీని రూపుదిద్దడంలో టాటా మోటార్స్ నాయకత్వాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన వాహనం జీరో-ఎమిషన్ ఎలక్ట్రిక్ బస్సు కావడం ప్రత్యేకత. ఇది గ్రీన్ మొబిలిటీ పట్ల ఉత్తర ప్రదేశ్, టాటా మోటార్స్ యొక్క నిబద్ధతను తెలియజేస్తోంది. ఈ లక్ష్యం రాష్ట్రం యొక్క 2070 నెట్-జీరో విజన్, సంస్థ యొక్క 2045 నెట్-జీరో లక్ష్యాలకు అనుగుణంగా ఉంది.
 
ఈ వాహనాన్ని, శ్రీ యోగి ఆదిత్యనాథ్, ముఖ్యమంత్రి, ఉత్తర ప్రదేశ్ మరియు శ్రీ ఎన్. చంద్రశేఖరన్, చైర్మన్ టాటా సన్స్ లిమిటెడ్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బ్రజేష్ పాఠక్, ఉప ముఖ్యమంత్రి, శ్రీ గిరీష్ వాఘ్, ఎండీ & సీఈఓ, టాటా మోటార్స్ లిమిటెడ్, ఇంకా ప్రముఖ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ అధికారులు మరియు టాటా మోటార్స్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, టాటా మోటార్స్ లక్నో ప్లాంట్ నుండి 10 లక్షల ట్రక్కులు, బస్సులను రోలౌట్ చేయడం యావత్ రాష్ట్రానికి గర్వకారణం. ఇది రాష్ట్ర సామర్థ్యాలకు, అపారమైన సంభావ్యతకు, అలాగే ఇక్కడి ప్రతిభావంతులైన ప్రజలకు లభించిన గుర్తింపు. పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తూ, ఉత్తర ప్రదేశ్‌ను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నది మా దార్శనికత. విస్తారమైన వినియోగదారుల మార్కెట్, యువ, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, నిరంతరాయమైన కనెక్టివిటీ మద్దతుతో, ఈ రాష్ట్రం విస్తరించగల వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఉత్తర ప్రదేశ్‌లో టాటా మోటార్స్ సాధించిన విజయం ఈ వాతావరణం యొక్క బలాన్ని ప్రతిబింబిస్తుంది. బాధ్యతాయుతమైన పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాలను సృష్టించడం, నైపుణ్యాలను పెంపొందించడం, సుస్థిర సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం పట్ల మా నిబద్ధతను ఇది మరింత బలపరుస్తుంది అని అన్నారు.
 
1992లో స్థాపించబడిన టాటా మోటార్స్ లిమిటెడ్ లక్నో ప్లాంట్, ప్రస్తుతం కంపెనీకి అత్యంత ముఖ్యమైన వాణిజ్య వాహనాల తయారీ కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ట్రక్కులు, బస్సులు తయారవుతాయి. ఇవి బహుళ పవర్‌ట్రెయిన్‌లలో జీరో ఎమిషన్ ఎలక్ట్రిక్, ఫ్యూయల్-సెల్ ఎలక్ట్రిక్ వాహనాలతో సహా ఉత్పత్తి చేయబడుతున్నాయి. దాదాపు 600 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్లాంట్, భారీస్థాయి తయారీని ప్రజల అభివృద్ధి, స్థిరత్వంతో కలిపి ముందుకు తీసుకెళ్తోంది.
 
ఇది 8,000 మందికి పైగా ప్రజల జీవనోపాధికి మద్దతు ఇస్తోంది. అలాగే, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ద్వారా పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్లాంట్ 100 శాతం పునరుత్పాదక శక్తితో నడిచే, వాటర్-పాజిటివ్ యూనిట్‌గా పనిచేస్తోంది, ఇది సమగ్ర వృద్ధి మరియు స్థిరత్వంపై కంపెనీ నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది. అదనంగా, ఇది బలమైన సరఫరాదారుల వ్యవస్థకు కూడా మద్దతు ఇస్తూ, ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా MSMEలు, Ancillary పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తోంది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ప్రతిపక్ష పార్టీలు మహిళలకు వ్యతిరేకమా? జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ