శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Ganesh
Last Updated : సోమవారం, 23 జూన్ 2014 (16:05 IST)

కుమార్తె లవ్‌ఎఫైర్.. చున్నీతో గొంతునొక్కి చంపేసిన కసాయి తండ్రి!

కూమార్తె ఓ యువకుడితో ప్రేమలో పడటంతో ఆ విషయం ఏవరికైనా తెలిస్తే పరువుపోతుందని తన ఇద్దరు కుమారులతో కలిసి కన్న కూతుర్ని హత్య చేశాడో కసాయి తండ్రి. ఈ దారుణ సంఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వివరాల్లోకెళితే...

స్థానికంగా ఉంటోన్న మినతి దలాయ్ అనే 19 ఏళ్ల యువతికి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కొద్దికాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం మినతి తండ్రి సూర్య దలాయ్‌కు తెలియడంతో ఆమెను మందలించాడు. అయినా మినతి తరచూ ప్రియుడ్ని కలవడంతో సూర్య దలాయ్‌కు ఆగ్రహం వచ్చింది.

కూతురి వ్యవహారం బయటపడితే తన పరువు పోతుందని ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడు. తన ఇద్దరు కొడుకుల సహాయంతో చున్నీతో పీక నొక్కి హత్య చేశాడు. అంతేకాకుండా ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని చెట్టుకు ఉరి వేసి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పారు. కానీ ఆమె ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా అసలు నిజం ఒప్పుకున్నారు. యువతిని హత్య చేసిన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.