సంబంధిత వార్తలు
- వెస్ట్ బెంగాల్ : నిన్న అభిషేక్ బెనర్జీ నేడు కళ్యాణ్ బెనర్జీపై దాడి...
- PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్లో యూత్ పెద్ది గెటప్తో వచ్చారు: రామ్ చరణ్
- అక్రమ వలసదారులకు బెంగాల్ సీఎం వార్నింగ్... వెళ్లిపోతారా.. వెళ్లగొట్టమంటారా?
- గోవులను ఎక్కడకు తరలిస్తున్నారు... బర్త్ సర్టిఫికేట్ ఉందా? బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్న
- నల్లకోటు ధరించి న్యాయవాదిగా మారిన మాజీ ముఖ్యమంత్రి ఎవరు?
నాడు వంట మనిషి.. నేడు బెంగాల్ రాష్ట్ర మంత్రి...
ఒకపుడు నెలకు రూ.2,500 సంపాదనతో కుటుంబాన్ని పోషించుకున్న ఓ మహిళ ఇపుడు ఏకంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రు సువేందు అధికారి మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆమె పేరు కలిత మఝి. పూర్బ బర్ధమాన్ జిల్లాలోని ఆమ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కలిత మారీ ఇపుడు ఏకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆమె, సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. కోల్కతాలో జరిగిన ఈ కార్యక్రమం ఆమె జీవిత ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది.
పూర్బ బర్ధమాన్ జిల్లాలోని ఆమ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కలిత మారీ నేపథ్యం అత్యంత సామాన్యమైనది. పేదరికం కారణంగా చదువును మధ్యలోనే ఆపేసిన ఆమె, కుటుంబాన్ని పోషించడానికి పలు ఇళ్లలో ఇంటి పనిమనిషిగా చేరారు. నెలకు రూ.2,500 నుంచి రూ.4,000 సంపాదిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఆమె భర్త దినసరి కూలీగా పనిచేసేవారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నడుమ కూడా ఆమె పదేళ్లుగా స్థానిక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు సేవ చేశారు.
ఆమె రాజకీయ ప్రస్థానం పట్టుదలకు నిలువుటద్దంలా నిలుస్తుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్లపై ఇదే ఆస్ట్రమ్ (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. దీని ఫలితంగా 2026 ఎన్నికల్లో 1.07 లక్షలకు పైగా ఓట్లు సాధించి, తన సమీప తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 12,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి వరించడం విశేషం.
మంత్రిగా అవకాశం రావడంపై కలిత మారీ భావోద్వేగానికి గురయ్యారు. "నాలాంటి వాళ్లు ఈ స్థాయికి చేరుకుంటారని కలలో కూడా ఊహించలేరు. ముఖ్యమంత్రి సువేందు అధికారి తన మంత్రివర్గంలో నాకు చోటు కల్పిస్తారని అస్సలు అనుకోలేదు" అని ఆమె విలేకరులతో అన్నారు. తన నియోజకవర్గంలో తాగునీటి సరఫరా, ఆసుపత్రి సౌకర్యాలు మెరుగుపరచడమే తన ప్రథమ కర్తవ్యమని, ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాల నేపథ్యంలో జరిగిన ఈ మంత్రివర్గ విస్తరణలో కలిత మారీఖ చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది. అట్టడుగు స్థాయి కార్యకర్తలకు సైతం ఉన్నత అవకాశాలు కల్పించడంలో తమ పార్టీ ముందుంటుందనడానికి ఆమె నియామకమే నిదర్శనమని బీజేపీ నేతలు అభివర్ణించారు. ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం ప్రజాస్వామ్యంలో అవకాశాలకు, పట్టుదలకు ప్రతీకగా నిలుస్తోంది.
