1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Woman occupies district judge chair in Varanasi court, attempts to conduct proceedings

వారణాసి జిల్లా కోర్టులో జడ్జి కుర్చీ ఖాళీగా ఉందనీ... (వీడియో)

woman - judge seat
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లా కోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం జిల్లా జడ్జి సెలవులో వెళ్లారు. అయితే, ఉదయాన్నే కోర్టు హాలులోకి వచ్చిన వందనా గుప్తా (50) అనే మహిళ నేరుగా వెళ్లి జడ్జి కుర్చీలో కూర్చుని గావెల్‌తో (చెక్క సుత్తి) కొడుతూ 'ఆర్డర్‌ ఆర్డర్‌.. విచారణలు ప్రారంభించండి?' అని సూచనలు జారీ చేశారు. 
 
ఊహించని ఈ ఘటనతో అవాక్కయిన న్యాయవాదులు కిందికి దిగాలని ఆమెను ఎంతగా కోరినా ససేమిరా అన్నారు. దగ్గరకు ఎవరూ రావద్దని హెచ్చరించారు. దీంతో కోర్టు హాలులో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. 
 
ఆ తర్వాత మహిళా పోలీసుల సాయంతో ఆమెను కిందికి దింపి కంటోన్మెంట్ ఠాణాకు తరలించారు. పోలీసుల విచారణలో వందన మానసిక పరిస్థితి బాగాలేదని గుర్తించి, నగర శివారులోని శివ్‌పుర్‌ ప్రాంతానికి చెందిన ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రాజకీయ ప్రత్యర్థి కుమార్తె అయినా మన బిడ్డే : ట్రోల్ చేసిన వాళ్లను పట్టుకుని బొక్కలో వేయండి.. : సీఎం యోగి ఆదేశం