విదేశాలకు అక్రమ వలసలను అరికట్టేందుకుగానూ ఏడంచెల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రవాస వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలతో రెండు రోజులపాటు నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.