విదేశాలలో ఉంటున్న భారతదేశ మధ్యవర్తులపై ఉక్కుపాదం మోపి, తద్వారా అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయనున్నామని కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖా మంత్రి వాయలార్ రవి స్పష్టం చేశారు. లిబియా, మలేషియా, యెమెన్, మాల్దీవులు, గల్ఫ్ దేశాల్లోని భారత దౌత్య కార్యాలయ అధికారులతో న్యూఢిల్లీలో సమావేశమైన సందర్భంగా ఆయన పై విధంగా స్పందించారు.