అమెరికాలో కాశ్మీర్ హిందూ ఫౌండేషన్ను ఏర్పాటు చేసినట్లు.. ఆ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. భారతదేశం వెలుపల ఏర్పాటయిన తొలి కాశ్మీర్ పండిట్ల సంఘం ఇదేననీ... తమ ప్రయోజనాలను కాపాడుకోవటం, అవసరాలను తీర్చుకోవటం కోసం ప్రవాస కాశ్మీరీ పండిట్లు ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారని నిర్వాహకులు పేర్కొన్నారు.