ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అమెరికాలోని వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మే 23వ తేదీన టెక్సాస్లోని ఇర్వింగ్లో, 24న టెన్నిసీలోని నాష్విల్లేలలో సంబరాలు జరిపేందుకు వైఎస్సార్ యువసేన ఏర్పాట్లను మమ్మురం చేసింది.