వచ్చే సంవత్సరంలో జరిగబోయే అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రవాస భారతీయుడు రాజ్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీ తరపున కాన్సాస్ రాష్ట్ర ప్రతినిధిగా పనిచేస్తున్న ఈయన... ప్రతినిధుల సభకు గనుక ఎన్నికయినట్లయితే, ఈ ఘనత సాధించిన మూడో భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కుతారు.