ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలకు సాయమందిస్తోన్న 'ఆరోగ్యశ్రీ' పథకానికి తన వంతు సాయంగా అమెరికాలోని ఆంధ్ర వైద్యుడు ప్రేమ్సాగర్ రెడ్డి 50 వేల డాలర్ల విరాళాన్ని అందజేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఈయన 50వేల డాలర్ల (సుమారు 25 లక్షల రూపాయలు) చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు.