ఆస్ట్రేలియాలో భారతీయుల రక్షణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని అక్కడి ప్రభుత్వం ఎంతలా చెబుతున్నప్పటికీ.. దాడులు, హత్యలు మాత్రం ఆగటం లేదు. తాజాగా ఆస్ట్రేలియాలో ఆదివారంనాడు మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. సిడ్నీలో ఓ రోడ్డుపక్కన హత్యకు గురైన సదరు భారతీయుడిని పంజాబ్కు చెందిన ధర్మేంద్ర సింగ్గా గుర్తించినట్లు అక్కడి పోలీసులు పోలీసులు వెల్లడించారు.