ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరుస జాత్యహంకార దాడుల పరంపరకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే సూచనలు కనిపించటం లేదు. తాజాగా సచిన్ అనే భారత విద్యార్థిపై దాడి జరిగిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వారం జరిగిన ఈ దాడిలో సచిన్ను గాయపరచడమే గాకుండా అతని వద్ద నుంచి నగదు, బంగారాన్ని కూడా దోచుకున్నట్లు తెలుస్తోంది.