ప్రవాస భారతీయులకు ఓటుహక్కు కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారమూ అందలేదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. అయితే ఈ విషయమై ప్రభుత్వం నుంచి సమాచారం కోసం వేచిచూస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.