గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (జీఓపీఐఓ-గోపియో) అవార్డులకు ఏడుగురు ప్రవాస భారతీయులు ఎంపికయ్యారు. తాము నివసిస్తున్న దేశంతోపాటు మాతృభూమి కోసం చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ ఏడుగురిని గోపియా అవార్డులు వరించాయి. కాగా.. వీరితోపాటు మరో ఇద్దరికి ప్రత్యేక పురస్కారాలను అందజేయనున్నారు.