సిక్కుల ఊచకోతలో బలైపోయిన కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలని.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాని కోరుతూ, ఆ మతానికి చెందిన రెండు సంస్థలు బహిరంగ లేఖ రాశాయి. భారత ప్రధాని మన్మోహన్ అమెరికా పర్యటన సందర్భంగా సిక్కుల ఊచకోత అంశాన్ని లేవనెత్తి, తద్వారా బాధితులకు న్యాయం చేకూరేలా, ఒత్తిడి తీసుకురావాలని ఆ సంస్థలు విజ్ఞప్తి చేశాయి.