వరద బాధితులకు సహాయం అందించాలన్న తమ పిలుపుకు మంచి స్పందన లభిస్తోందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో భాగంగా తాము సేకరించిన సహాయ సామగ్రిని సముద్ర మార్గం ద్వారా ఓడలో భారతదేశానికి పంపిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.