ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో... ఆ దేశానికి వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. విద్యార్థుల సంఖ్య రాన్రానూ తగ్గుతుండటంవల్ల గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆసీస్ యూనివర్సిటీలు భారత విదేశాంగ శాఖా మంత్రి ఎస్.ఎం. కృష్ణతో సమావేశమయ్యేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.