బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డెన్ బ్రౌన్ క్యాబినెట్లో ఆసియా వాసులకు తగిన విధంగా న్యాయం లభించలేదంటూ హౌస్ ఆఫ్ కామన్స్ కమిటీ సమావేశంలో భారత సంతతి ఎంపీ పరంజీత్ ధండా (38) ఆరోపించారు. రెండు సంవత్సరాల క్రితం బ్రౌన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి క్యాబినెట్లో ఇద్దరు నిర్దిష్ట జాతికి చెందిన మైనారిటీ వర్గీయులు ప్రాతినిధ్యం వహించారనీ, ఇప్పుడు ఒక్కరికి కూడా ఆ గౌరవం దక్కలేదని ఆయన ఆరోపించారు. దీన్ని మీరు అంగీకరిస్తారా..? అంటూ పరంజీత్, బ్రౌన్ను ప్రశ్నించారు.