ప్రవాస భారతీయులకు న్యాయ సహాయం అందజేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఓ ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసింది. చండీఘడ్కు చెందిన ఎన్నారైలకు న్యాయ సంబంధ విషయాలలో సహాయం చేసేందుకుగానూ ఈ ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విషయమై చండీఘడ్ ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ... ఆస్తి, ఆర్థిక, వివాహం తదిర వివాదాలలో న్యాయం పొందేందుకు ఎన్నారైలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందనీ.. కొన్నిసార్లు ఏజెంట్లబారిన పడి వారు మోసపోతున్నారని చెప్పారు.