భారత 62వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చికాగోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను చికాగోలోని ప్రవాస భారతీయులందరూ వారం రోజులపాటు జరుపుకుంటారు. భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో చికాగో మేయర్ సందేశాన్ని ప్రజా సంబంధాల కమీషన్ డైరెక్టర్ క్రిపాల్ జాలా చదివి వినిపించారు.