భారత పరిశోధకుడిపై జాతి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన నేరానికిగానూ దక్షిణ కొరియా జాతీయుడికి సియోల్లోని స్థానిక కోర్టు భారీ జరిమానాను విధించింది. భారతీయ పరిశోధకుడు హుస్సేన్పై అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ పార్క్ అనే 31 సంవత్సరాల కొరియన్ యువకుడి ఇంచియాన్ జిల్లా కోర్టు 1 మిలియన్వాన్ (865 అమెరికన్ డాలర్లు)ల జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించింది.