ఒక మేజర్ సర్జరీని చేయటంలో భారత సంతతి వైద్యుడు డాక్టర్ జయంత్ పటేల్ (59) అనుభవరాహిత్యంతో వ్యవహరించాడని బ్రిస్బేన్ సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. కాగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించి ముగ్గురి మరణానికి కారణమవటమేగాకుండా, మరొకరి శరీరానికి హాని కలిగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పటేల్పై బ్రిస్బేన్ సుప్రీంకోర్టులో నిన్న విచారణ ప్రారంభమైన సంగతి తెలిసిందే.