అమెరికా సంయుక్త రాష్ట్రాలకు (యూఎస్) విద్యనభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులకు స్టడీ వీసాలను జారీ చేసేందుకు డిసెంబర్ 12వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు.. హైదరాబాదులోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా 400 స్టడీ వీసాలను జారీ చేయనున్నామనీ.. ఇందుకోసం ఆరోజు కాన్సులేట్ జనరల్ కార్యాలయం విధులను నిర్వహిస్తుందని పత్రికలకు విడుదల చేసిన ఓ ప్రకటనలో కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.