ఆస్ట్రేలియాలో తన ఐదు రోజుల పర్యటనను ముగించుకున్న భారత విదేశాంగ శాఖా మంత్రి ఎస్.ఎం.కృష్ణ సోమవారం స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఈ మేరకు, భారత విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల గురించి ఆ దేశ అధికార యంత్రాంగాన్ని కలుసుకున్న ఆయన... విద్యార్థుల రక్షణకై తీసుకుంటున్న చర్యల గురించి తీవ్రంగా చర్చించారు.