దక్షిణాఫ్రికా దేశంలో స్థిరపడిన భారతీయ వ్యాపారి ఒకరు దోపిడీ దొంగల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రిటోరియాలోని లాడియం ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వ్యాపారి ఇంటి పనిమనిషి సహకరించి గేటు తీయటంతో ఇద్దరు దొంగలు ఇంట్లోకి చొచ్చుకుని వచ్చినట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఇంటి యజమానులైన ఫైజల్ జూసబ్, ఆయన సోదరుడు యూసుఫ్ జూసబ్లను రివాల్వర్లతో బెదిరించి డబ్బును దోచుకున్నారు...