ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల వివరాలను భారతదేశానికి అందజేస్తామని విక్టోరియా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల భారతదేశంలో పర్యటించిన విక్టోరియా ప్రధానమంత్రి జాన్ బ్రంబీ ఈ మేరకు న్యూఢిల్లీలో ఈ ప్రతిపాదన చేశారని ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.