భారత విద్యార్థులపై జాత్యహంకార దాడులకు పాల్పడినవారు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం పునరుద్ఘాటించింది. దాడుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉండటంతో ఆందోళనలు తీవ్రతరంకాక తప్పవని గ్రహించిన ప్రభుత్వం... తాము విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.