వర్జీనియాలో భారత సంతతికి చెందిన నిరుపేద బాల బాలికల్లో విద్య, ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధులను సేకరించేందుకు 5కె రన్ను నిర్వహించనున్నట్లు ఆశా జ్యోతి అనే సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా పెద్దలకు 5కె రన్, చిన్నారులకు ఒక మైలు దూరం పరుగు పోటీలను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.