ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరినీ ఒకే వేదికపైకి తెచ్చే ప్రవాసీ భారతీయ దివస్ గురువారం నుంచి దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మూడు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సులో 50 దేశాల నుంచి వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు పలువురు హాజరుకానున్నారు.