మ్యారేజీహాల్ యజమాని, అతడి కుమారుడిపై దాడి చేశారనే ఆరోపణలతో ఓ ప్రవాస భారతీయ కుటుంబానికి చెందిన 9మందిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారంతా బ్రిటన్లోని సౌత్హాల్, లీచెష్టర్ ప్రాంతాలకు.. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతాలకు చెందినవారు కావడం గమనార్హం. కాగా.. ఈ సంఘటనతో సంబంధమున్న మరికొందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.