రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి తాము మరింతగా బలం పుంజుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు మలేసియన్ ఇండియన్ కాంగ్రెస్ (ఎమ్ఐసీ) అధ్యక్షుడు సామివేలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. మలేసియాలోనే అతిపెద్ద భారతీయ పార్టీ అయిన ఎమ్ఐసీ తన బ్రాంచ్ కార్యాలయాలను దాదాపుగా రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.