అమెరికాలో క్రీయాశీలకంగా పనిచేసే రాజకీయ సంస్థ పీపుల్ ఫర్ లోక్సత్తా(పీఎఫ్ఎల్) అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత మాజీ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడితో ప్రవాస భారతీయుల కోసం బహిరంగ సదస్సును ఏర్పాటు చేయనున్నది. ఈ సదస్సులో ఆమె భారత్లో అవినీతికి వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమాలతో పాటు లోక్పాల్ బిల్లు గురించి తెలియజేయనున్నారు. లోక్పాల్ బిల్లు కోసం భారత ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల్లో తన అనుభవాల గురించి ఆమె వారికి వివరించనున్నారు. డాక్టర్ కిరణ్ బేడి ఇండియా విజన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కూడా. ఈ సంస్థ పోలీసులు, ప్రజల మధ్య సహృద్భావ పరిస్థితులను కల్పించడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో చేపట్టిన 'సేవ్ లీగల్ ఎయిడ్' ప్రాజెక్ట్కు సహకరిస్తున్నారు.